హఫీజ్పేట్ : హఫీజ్పేట్ డివిజన్ ఆల్విన్ క్రాస్ రోడ్డులోని మమత ఎస్టేట్స్లో భజరంగీసైన్యం అధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టివినాయక మండపంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాన సరస్వతిపీఠం అధిపతి మాడుగుల నాగఫణీశర్మ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మహిళామూర్తులతోకలసి విఘ్నేశ్వరునికి మహాహారతిని సమర్పించారు. అంతకుముందు శేరిలింగంపల్లి భాగ్యనగర్ గణేశ్ఉత్సవసమితి తరపున కన్వీనర్ జ్ఞానేంద్రప్రసాద్ ఆయనను శాలువాతో ఘనంగా సన్మా నించారు. కార్యక్రమంలో చివరగా నాగఫణీశర్మ గణనాధుని ప్రవచాలను ప్రవచించి ఆహుతులను మైమరిపించారు. కార్యక్రమంలో ఉత్సవకమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.