అమీర్పేట్ : పారిశుద్ధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ జోన్ పారిశుద్ధ్య కార్మికులకు 15 రకాల కొవిడ్ రక్షణ వస్తువులతో కూడిన కిట్లను వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ముందు వరుసలో ఉంటూ తమ సేవలందించారని ప్రశంసిస్తూ.. మున్ముందు తమ విధుల నిర్వహణలో కిట్లోని వస్తువుల వినియోగంతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్మికులు మంత్రి తలసాని చేతుల మీదుగా మట్టి గణపతులను అందుకున్నారు.