చిక్కడపల్లి , ముషీరాబాద్, కవాడీగూడ : ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే తన జన్మదిన కేక్ కట్ చేసిన సంబురాలు జరుపుకున్నారు.
పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాంనగర్ ఈ సేవా వద్ద టీఆర్ఎస్ నాయకులు నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాంల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోపాల్ ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ నేతలు మాధవ్, శ్యామ్సుందర్ల ఆధ్వర్యంలో జమిస్తాన్పూర్ పాఠశాలకు ప్యాన్లు, విద్యుత్ దీపాలు, సానిటైజర్లు అందచేశారు. ముషీరాబాద్లో డి.శివముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.
చిక్కడపల్లిలో డివిజన్ అధ్యక్షుడు ఎరం శ్రీనివాస్ గుప్తా, గుండుజగదీశ్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ పంపిణీ చేశారు. రాంనగర్ డివిజన్లో పండ్లు పంపిణీ చేశారు.బోలక్పూర్, కవాడీగూడ ప్రాంతాల్లో టీఆర్ ఎస్ నాయకులు పండ్లు, అన్నదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నోట్బుక్కులు పంపిణీ చేశారు. పలుచోట్ల పేదలకు చీరలు పంచిపెట్టారు.