నేరేడ్మెట్, ఆగస్టు : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరిగిన వన్డే ఓపెన్ క్రికెట్ లీగ్ చాంపియన్షిప్లో గాడే ఇషాంత్రెడ్డి, రిషబ్లు అద్భుత ఆటను ప్రదర్శించాడు. హకీంపేట్ డీఎంఆర్సి గ్రౌండ్లో జరిగిన టోర్నమెంట్ సన్ గ్రేస్ క్రికెట్ క్లబ్ నుంచి మొట్ట మొదట బ్యాటింగ్ కు దిగిన గాడె ఇషాంత్రెడ్డి, రిషబ్లు పాట్నర్షిప్లో 125 స్కోర్ చేసి జట్టు విజయానికి కారకులయ్యారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన దృవ్ ఎలెవెన్ 179 రన్స్కే ఆల్ అవుట్ అయింది. సన్గ్రేస్ క్రికెట్ క్లబ్ నుంచి గాడె ఇషాంత్ రెడ్డి, రిషబ్ అద్భుతమైన ప్రతిభ చూపించి జట్టు విజయానికి కారకులయ్యారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా గాడె ఇషాంత్రెడ్డి సొంతం చేసుకున్నాడు.