సైదాబాద్ : హైదరాబాద్ జిల్లా సైదాబాద్ మండల పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులు హైదరాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారిలో సైదాబాద్ జీహెచ్ఎస్ స్కూల్ టీచర్ టి. ప్రద్యుమ్నరెడ్డి, సైదాబాద్ అస్మాన్ఘడ్ జీపీఎస్ టీచర్ జి. పుష్పలత, జీపీఎస్ స్కూల్ హెడ్మాస్టర్ బి. సుచరిత, కాలడేరా జీపీఎస్ టీచర్ పులి నిర్మల ఉన్నారు.
కాగా వారికి మంగళవారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్రెడ్డిల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేయనున్నారు.
నలుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సందర్భంగా పీఆర్టీయూ సైదాబాద్ మండలశాఖ అధ్యక్షులు మందడి వెంకట్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలో నలుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు అందు కోవటం పట్ల పలువురు సహా ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.