బన్సీలాల్పేట్ : పద్మారావునగర్లోని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 186వ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వ్యానులో తిరుగుతూ రోడ్ల పక్కన ఉంటూ ఆకలితో అలమటించే వృద్ధులను, అభాగ్యులను, దిక్కులేని వారిని, దివ్యాంగులను అప్యాయంగా పలకరించి వారికి భోజనం సమకూర్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నదానం నిర్వహించామని స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షురాలు ఓ.పావని తెలిపారు. సభ్యులు కీర్తి, కోమల్, ఖుషి, ఇర్ఫాన్, అఖిల్, రాజనర్సింహరావులు పాల్గొన్నారు.