మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ ఏర్పాట్లను ఆయా కమిటీలు పరిశీలిస్తున్నాయి. ప్లీనరీ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లతో పాటు ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.