చంపాపేట : ప్రతి ఒక్కరు భక్తిభావాలు అలవర్చుకోవాలని తెలంగాణ రాష్త్ర తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆయన 66వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బుదవారం రాత్రి చంపాపేట పోచమ్మగడ్డలోని శ్రీ ప్రసన్నాంజ నేయ స్వామి, శ్రీ శిరిడి సాయిబాబా సంయుక్త ఆలయానికి మారుతి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధు సూదనాచారిని ఆహ్వానించి కాలనీ అధ్యక్షుడు నర్సింహచారి ఆధ్వర్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి సంయుక్త ఆలయాలను సందర్శించి శిరిడీ సాయిబాబాకు, ప్రసన్నాంజనేయ స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన పుట్టిన రోజు వేడుకలకు కాలనీవాసులు తెచ్చిన కేక్ కట్చేసి పలువురికి పంచిపెట్టారు.. ఈ సంద్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి, మధుసూదనాచారిని శాలువలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ ఈ నెల 25న ప్రారంభం కానున్న టీఆర్ఎస్ ఫ్లీనరీ డ్రాప్టింగ్ కమిటీకి చైర్మెన్ గా నియమించిన సందర్భంగా రాష్త్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్త్ర ఫ్లీనరీ విజయవంతం అయ్యేలా చూడాలని తనకు ప్రభుత్వం అప్పగించిన కీలకమైన భాధ్యతలు విజయవంతం చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ పి జైపాల్రెడ్డి, మారుతినగర కాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి సుధాకర్, కోశాధికారి కె పురుషోత్తంరెడ్డి, కాలనీ మాజీ అధ్యక్షులు అసోసియేషన్ సభ్యులు స్వర్నకారుల సంఘం రాష్త్ర అధ్యక్షుడు వింజమూరి రాఘవచారి, డివిజన టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.