మాదాపూర్ : మదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్లో ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లు పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం వాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఒకరు టీకాలను వేసుకునేందుకు ముందుకు రావాలని, టీకాలతోనే కరోనా కట్టడి సాధ్యమన్నారు.
మాస్కులు ధరించి, బౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసులు, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.