మహేశ్వరం : ప్రతి ఒక్కరూ సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని శ్రీవిశ్వ విజ్ఞాన విద్యాఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అన్నారు. గురువారం గట్పల్లిలోని ఉమర్ అలీషా ఆశ్రమంలో అవతారి హస్సెన్షా జన్మదినం సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు.అనంతరం జరిగిన ఆధ్యాత్మిక సభలో ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత ద్వారానే నేటి సమాజంలో మానవుడు అదుపులో ఉంటున్నాడని అన్నారు. నిత్యజీవితంలో మానవుడు ఓర్పు, సహనం, తృప్తి ఉంటేనే అన్ని బాధలను అధిగమించగలడన్నారు.
మనస్సును అదుపులో పెట్టి శరీరాన్ని సన్మార్గంలో నడిపేవారు సద్గురులని ఆయన అన్నారు.నిత్య జీవితంలో జీవన విదానానికి సద్గురు వర్యులు దిక్సూచిగా పనిచేస్తారని ఆయన అన్నారు. జ్ఞానం మనస్సును పరిశుభ్రం చేస్తుందని అన్నారు. భక్తి, విశ్వాసం, జ్ఞానం, ఉంటే భగవంతుని దివ్య స్వరూపం దర్శనం చేరుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రిటైర్డుహైకోర్టు జడ్జీ రామలింగేశ్వర్రావు,దాసరిశ్రీనువాసరావు ,సర్పంచ్ అనితాప్రభాకర్రెడ్డి, శేషకుమారి ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.