కవాడిగూడ: ముషీరాబాద్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ముషీరాబాద్ విద్యా మండలి డిప్యూటీ ఈఓ సామ్యూల్ రాజ్, పాఠశాల ప్రధానోప్యాయులు ఎం. నరేందర్ యాదవ్లలో కలిసి పాఠశాల తరగతి గదుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా పాఠశాల ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముషీరాబాద్ నియోక వర్గ ప్రజల కళను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను కూల్చివేసి ఆధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్డీ సంస్ధ ప్రతినిధులు పార్వతి, శివరాణి, పాఠశాల సిబ్బంది దేవిడ్ రతన్కుమార్ తదితరులు పాల్గొన్నారు