వ్యవసాయ యూనివర్సిటీ : ఆపదలో ఉన్నవారికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడొద్దని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సులేమాన్ నగర్ కాలనీకి చెందిన రేష్మ బేగం అనారోగ్యానికి గురై ఇటీవల చికిత్సపొందింది. చికిత్సకు ఎక్కువ ఖర్చుకావడంతో వారు సీఎంఆర్ఎఫ్ నిధికి ధరఖాస్తు చేసుకున్నారు.
కాగా వారి కుటుంబానికి స్థానిక టిఆర్ఎస్ నాయకులు షేక్ నయ్యూమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మంగళవారం ముఖ్యమంత్రి సహయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆపదలో ఉన్న సామాన్యులకు బరోసా నిస్తూ ఆదుకుంటుందని తెలిపారు .కార్యక్రమంలో నాయకులు షేక్బాబ , ఇబ్రహీం, సనా, సయ్యద్ సమియోద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.