చాదర్ఘాట్ :రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద యువతుల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్బలాల అన్నారు. సైదాబాద్ మండలం పరిధిలోని సలీంనగర్, అఫ్జల్ నగర్, ముసారాంబాగ్, శాలివాహననగర్, గడ్డిఅన్నారం కాలనీ, రెడ్డి కాలనీ, సైదాబాద్ కాలనీలకు చెందిన లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
షాదీముబారక్-24, కల్యాణలక్ష్మి -16 చెక్కులను ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పేదప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ మండల ఆర్ఐ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.