అంబర్పేట : హిమాయత్నగర్ మండల పరిధిలో నివాసముంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న 45 మంది లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చెక్కులను అందజేశారు. హిమాయత్నగర్ మండల కార్యాలయంలో కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, వై.అమృత, కన్నె ఉమాదేవి, తాసీల్దార్ లలితతో కలిసి ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ చెక్కులు వస్తున్నాయని చెప్పారు. కరోనా వంటి కష్టకాలంలోను సీఎం కేసీఆర్ చెక్కులను అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆర్ఐ జగదీశ్వర్రావు, మధు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.