కవాడిగూడ : ప్రముఖ సాంస్కృతిక సంస్థ సూర్యచంద్ర ఆధ్వర్యంలో ‘విశిష్ట జాతిరత్న-విశిష్ట దంపతుల పురస్కారాల’ కార్యక్రమాన్ని నగరంలోని బాషా నిలయంలో నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షుడు మోహన్ చంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ హనుమంతరాయ శర్మ, పీవీ. బైరవన్, సిద్దప్ప, శ్రీనివాసరావు, డాక్టర్ ధీరజ్, రామచంద్రారావు, వీరయ్య, నర్సింగ్రావు, మధన్ మోహన్, చంద్రశేఖర్, తేజలకు విశిష్ట జాతిరత్న, విశిష్ట దంపతుల పురస్కారాలను అందజేశారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఢిల్లీ సలహాదారు సముద్రాల వేణుగోపాల చారీ, డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరై పురస్కారాలు అందజేశారు.