మారేడ్పల్లి : మోండా డివిజన్ శివాజీనగర్లోని పెరుమాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం స్వామి వారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని రథం పై ఊరేగించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో పండగ వాతవరణం నెలకొంది. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ శ్రీనివాస శర్మ అన్ని ఏర్పాట్లు చేశారు.
మారేడ్పల్లిలో…
మారేడ్పల్లిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో చంఢీహోమం, పూర్ణహుతి తదితర పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ సుధాకర్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు టి. రాజేశ్వర శర్మ, శేఖర్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు నరేష్ తదితరులు పాలల్గొన్నారు.