బడంగ్పేట: పట్టణాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మేయర్ దుర్గా దీప్లాల్ హన్ అధ్యక్ష తన జరిగింది. ఎజెండాలో ఉన్న 67 అంశాలపై చర్చించారు. గతంలో జరిగిన పనుల పురోగతి, జరగవలసిన పనుల గురించి మంత్రి చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారిచేశారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి నెల ప్రభుత్వం నిధులు కెటాయిస్తుందన్నారు. బడ్జెట్లో గ్రీనరీ కోసం పది శాతం నిధులు కెటాయిస్తుందన్నారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, వరద కాల్వల నిర్మాణం పై సమావేశంలో చర్చించారు. ప్రజల మౌలిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అందరు సమ్వయంతో పనిచేసి అభివృద్ధికి భాటలు వేయాలన్నారు.
ప్రతి డివిజన్లో నర్సరీ ఉండాలిః సబితా ఇంద్రారెడ్డి
ప్రతి డివిజన్లో నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు కొనుగోలు చేయకుండా డివిజన్ల పరిధిలోనే మొక్కలు పెంచే బాద్యత డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. మీర్పేట కార్పొరేషన్ పరిధిలో కేవలం రెండు నర్సిరీలు మాత్రమే ఉన్నాయని ఆమె అన్నారు.
ఇక నుంచి ప్రతి డివిజన్లో నర్సిరాల ఏర్పాటు తప్పని సరిగా ఉండాలన్నారు. కార్పొరేషన్లో ఉన్న స్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రెండు కోట్లు కెటాయించిందని మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడలో ఒక స్మశాన వాటిక, మీర్పేటలో ఒక స్మశాన వాటికను అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు.
మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటికి మంచినీరు:సబితా ఇంద్రారెడ్డి
మిషనర్ భగీరథ ద్వార ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయబోతున్నామని అన్నారు. మూడు రిజర్వాయర్స్ను కొత్తగా నిర్మాణం చేయబోతున్నామని మంత్రి అన్నారు. రెండవ దశలో పైపులైన్ పనులు, పూర్తి చేసి నీటి సరఫరా చేయడానికి అధికారులు కసరత్తు చేయాలని ఆదేశాలు జారిచేశారు.
కాలనీలలో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఏడు ట్రాన్స్ ఫార్మర్స్ను ర్పాటు చేయాలన్నారు. త్వరగా డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారిచేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ కమిషనర్ డి శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్స్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.