చిక్కడపల్లి :కొవిడ్ టీకా సురక్షితమైనదని ప్రతి ఒక్కరూ వేయించుకొని కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని తాసీల్దార్ సి.హెచ్.లలిత అన్నారు.శనివారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలో లంబడితాండ బస్తీలో వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేసేందుకు వ్యాక్సిన్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నుంచి రక్షణ పోందేందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి నుంచి అందరికీ రక్షణగా వ్యాక్సిన్ నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రవి చారి, కార్పొరేటర్ రవి చారి, డిప్యూటీ తసీల్దార్ ఆసీఫ్ ఖాన్,లంబడితాండ బస్తీ అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.