మాదాపూర్ : మద్యానికి బానిసై తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం … గుడివాడకు చెందిన సురపనేని అకిల్ సాయి (27) బతుకుదెరువు కొరకు హైదరాబాద్ వచ్చి మాదాపూర్ గుట్టలబేగంపేటలోని మౌనిక టవర్స్లో నివాసం ఉంటున్నాడు.
లాక్డౌన్ నుండి ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి బుధవారం ఉదయం 8 గంటలకు మాదాపూర్లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో జీహెచ్ఎంపీ డీఆర్ఎఫ్ బృందాలు దుర్గం చెరువులో మృతదేహన్ని వెలికితీశారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.