మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు ఆసరాలాంటిదని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన పర్వతాలు అనారోగ్యానికి గురవడంతో వైద్యఖర్చుల నిమిత్తము సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకోగా అతనికి 4లక్షల రూపాయల చెక్కును సీఎం సహాయనిధినుండి మంజూరుచేసారు.
అట్టి చెక్కును నగరంలోని మంత్రి కార్యాలయంలో అతనికి అందజేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని ఆమె అన్నారు. సీఎం రిలీఫ్ఫండ్ చెక్కు ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.
ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల యువజన సంఘం అద్యక్షులు దయాలశ్రీను, గ్రామ మాజీ సర్పంచ్ మధు, బండనర్సింహ్మ, వినోద్, వెంకటేష్ పాల్గొన్నారు.