అంబర్పేట : అంబర్పేట డివిజన్కు చెందిన పి.పూర్ణిమ ఇటీవల అనారోగ్యానికి గురై దవాఖానలో చేరింది. ఆమె దవాఖాన ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును గురువారం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు అందించారు.