ముషీరాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ బృహత్తర పథకాల అమలుతో ముందుకుసాగుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా దళితులకు పది శాతం అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాంనగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎరం శేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వి.సుధాకర్గుప్త, ఆర్ మోజస్, గజ్జల సూర్యనారాయణ, ముదిగొండ మురళీ, సుబ్బారావు, ఇంద్రసేనారెడ్డి, కిష్రావు, దామోదర్రెడ్డి, మహేష్, దీన్దయాల్ రెడ్డి, రాజు చారి, సురేందర్, రాజశేఖర్గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.