మహేశ్వరం, పహాడీషరీఫ్ : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి పెన్నిధి వంటిదని, సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్కు చెందిన గడ్డం కృష్ణ ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా అతనికి 60వేల రూపాయలను మంజూరు చేసారు. ఆ చెక్కును నగరంలోని మంత్రి నివాసంలో గ్రామ సర్పంచ్ థామస్ రెడ్డితో కలిసి అందజేశారు.
అలాగే జల్పల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. ప్రైవేట్ దవాఖానాలో చికిత్స తీసుకున్నాడు. అధిక ఖర్చు కావడంతో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబ సభ్యులు జల్పల్లి కో – ఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యంజాల జనార్థన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించారు. రూ. 60 వేలు మంజూరు కావడంతో ఆ చెక్కును మంత్రి బుధవారం ఆమె నివాసంలో బాధితుడి సతీమణికి అందజేశారు.