చాదర్ఘాట్ :ఆజంపురా డివిజన్లోని శ్రీ పిలక్మాతా(శ్రీ శీతలాదేవీ) సహిత శ్రీ శివ పంచాయతన శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సంలో పాల్గొని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో జరిగిన అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా భక్తులు వందలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర కమిషనర్ అంజనీకుమార్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు కమిషనర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫర్హత్నగర్ కమిటీ ప్రతినిధులు, గుగ్గుర్తి అమర్నాథ్ తదితరులు ఉన్నారు.