శంషాబాద్ :శంషాబాద్ లోని కుమ్మరిబస్తి శ్రీ ఉగ్ర లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో మంగళవారం వైభవంగా చందనోత్సవం, శ్రీ కృష్ణాష్టమి అర్చనలు నిర్వహించారు. భక్తుల గోవిందా….గోవిందా…..నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది.
ఉదయం సుప్రభాత సేవలతో అర్చనలు ప్రారంభించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చందనోత్సవం కన్నుల పండుగగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లు దివ్యాలంకారంలో దర్శనమిచ్చారు. భక్తిప్రపత్తులతో భక్తులు దర్శించుకొని తరించారు. శంభులింగేశ్వర, శాంభవిదేవీలకు పంచామృతాభిషేకాలు జరిపారు.