వెంగళరావునగర్ : భూస్వామ్య వ్యవస్థ పై తిరుగుబాటు చేసి,ఆ వ్యవస్థను రూపుమాపేందుకు పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు. జవహర్ నగర్ కూడలి వద్ద ఆదివారం డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ముఖ్యఅతిధిగా పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కృషి మరవలేనిదని, మహిళల్లో చైతన్యం నింపిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, రాజు రజక, బాలు రజకతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.