జూబ్లీహిల్స్ : ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారులన్నీ ఎల్ఈడి సెంట్రల్ లైటింగ్తో ప్రకాశవంతంగా మారనున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. గురువారం యూసుఫ్గూడ డివిజన్లో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి సెంట్రల్ పోల్ స్ట్రీట్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణానగర్ స్పైసీ హోటల్ నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్ళే సత్యసాయి మెయిన్ రోడ్డు వరకు 20 సెంట్రల్ లైట్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాత్రివేళల్లో ప్రయాణీకులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా కొత్తగా పోల్స్ వేయడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినాయక నవరాత్రోత్సవాల లో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని, నిమజ్జనం కోసం వెళ్ళే వాహనాలకు వీధుల వెంబడి అదనపు లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎలాక్టికల్ ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లిఖార్జున్, ఏఈ రాజశేఖర్, సర్కిల్ ఇన్ఛార్జ్ రాజేశ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్దాస్, డివిజన్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.