అమీర్పేట : పౌర్ణమిని పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు నేతి దీపాల వెలుతురులో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయాన్నినేతి దీపాలతో అలంకరించారు. బంగారు చీర అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ వేదపండితులచే చండీ హోమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో ఈ హోమంలో పాల్గొన్నారు.