బేగంపేట్ :సికింద్రాబాద్ జనరల్ బజార్లోని కలాసిగూడ జూలమ్మ దేవాలయంలో ఆదివారం శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ కోషికే కిరణ్మయికిషోర్లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవాలను పురస్కరించుకోని ఆలయ నిర్వహాకులు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పూజల అనంతరం దేవాలయం ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షుడు ఓంప్రకాశ్, సభ్యులు ఆంజనేయులు, విజయ్చారి, బ్రాహ్మచారి తదితరులు పాల్గొన్నారు.