కందుకూరు: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు కందుకూరు మండలంలోని బాచుపల్లి గ్రామంలో నాభిశిలా పోతులింగ బోడ్రాయి పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, సర్పంచ్ యాలల శ్రీనివాస్ లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని చెప్పారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమాలు, పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి రోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలను ఆహ్వానించినట్లు తెలిపారు. వీరితో పాటు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, హజరవుతారని పేర్కొన్నారు. బొడ్రాయి ప్రతిష్టాకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.