సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలో కార్పొరేట్కు దీటుగా మెరుగైన వైద్యం అందుతుందని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశి కళా రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా దవాఖాన బయో కెమిస్ట్రీ విభాగంలో 60 లక్షల రూపాయల విలువ చేసే అత్యాధునిక అల్ట్రా మోడ్రన్ క్లినికల్ కెమిస్ట్రీ ఆటో అనలైజర్ యంత్రాన్ని ఆమె సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న వైద్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని పటిష్టం చేస్తూ ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాలా సహకరించడం అభినందనీయమన్నారు.
సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ మాట్లాడుతూ ఈ యంత్రం ఏర్పాటుతో రోగులకు త్వరిత గతిన అన్ని రకాల రక్త పరీక్షలు చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. రోజుకు 400 పరీక్షలను ఈ యంత్రం చేస్తుందని తద్వారా రోగులకు మరింత తొందరగా వైద్య సేవలు అందించేందుకు వీలుంటుదన్నారు. రోగి వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు శస్త్ర చికిత్సల కంటే ముందు ఈ రక్త పరీక్షలు ఎంతో అవసరమని అన్నారు. టీఎస్ఎంఐడీసీ సహకారంతో ఏర్పాటైన ఈ యంత్రంతో పేద రోగులకు ఎంతో మేలు అని అన్నారు.