ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ గ్రీన్పార్కుకాలనీకి చెందిన సత్యనారాయణకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ. 1.25 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తిలక్, జక్కిడి రఘువీర్రెడ్డి, రాకేష్ టాకూర్, అరుణ్రెడ్డి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.