శంషాబాద్ రూరల్ : తెలంగాణ ఆడబిడ్డల పండుగా బతుకమ్మ వేడుకలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల పండుగ అయిన బతుకమ్మను తొమ్మిది రోజులపాటు గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఆడబిడ్డ ఆడుకుంటుందన్నారు.
తీరోక్క పూలను తీసుకువచ్చి బతుకమ్మలను పేర్చి అందరంగా తయారు చేసి 9రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారని వివరించారు. తెలంగాణ నేల పూలను పూజించే సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, డీఎల్పీవో అన్నపూర్ణ, ఎంపీవో సురేందర్రెడ్డి, సర్పంచ్లు రాజ్కుమార్, మాధవి,ఉప సర్పంచ్ ఆంజనేయుగౌడ్,నీరటి రాజు ముదిరాజ్,పలువురు మహిళలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.