మధిర : ప్రతిఒక్కరూ టీబీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత అన్నారు. మండల పరిధిలోని తొర్లపాడు గ్రామంలో జిల్లా వైద్య అధికారులు ఆదేశాల మేరకు డీటీసీవో డాక్టర్ సుబ్బారావు పర్యవేక్షణలో అంగన్వాడీ కేంద్రంలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 కల్లా క్షయవ్యాధి అంతం చేయాలనే కార్యక్రమంలో భాగంగా టీబీపై జనఆందోళన అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. టీబీ రహిత సమాజం కోసం అందరూ కృషిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పింగళి శిరీషరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకుడు లంకా కొండయ్య, మధిర టీబీ సూపర్వైజర్ సందీప్, ఏఎన్ఎం భారతి, నాగమణి, అంగన్వాడీలు నాగేంద్ర, రేణుక, గ్రామపంచాయతీ సెక్రటరీ విజయలక్ష్మీ, అంగన్వాడీ నాగలక్ష్మీ, ఐకేపీ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.