చిక్కడపల్లి :కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయిని, ప్రముఖ రచయిత్రి హైమవతీ భీమన్న జన్మదినం సందర్భంగా బుధవారం ప్రముఖ రచయిత్రికి డాక్టర్ గురజాడ శోభాపేరిందేవికి పురస్కారాన్ని అందజేశారు. హైమవతీ భీమన్న తల్లి దండ్రులు కొత్తూరి వెంకట లక్ష్మి,కొత్తూరి సుబ్బయ్య దీక్షితుల పేరట నగదు పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసా పత్రంను శోభా పేరిందేవికి అందించారు.
ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని అందజేసిన న్యూఢిల్లీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.సముద్రాల వేణుగోపాల్ చారి మాట్లాడుతూ హైమతీభీమన్న పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ వారి పేరుతో అవార్డు, నగదు పురస్కారం గత 18 సంవత్సరాలుగా ఇవ్వడం అభింనదనీయం అన్నారు. డాక్టర్ వెలుదండి నిత్యనంద రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత్రి ముక్తతి భారతి, డాక్టర్ నాగేశ్వర రావు, భోగరాజు, కళానిలయం కార్యదర్శి సురేందర్ తదితరలు పాల్గొన్నారు.