ఉస్మానియా యూనివర్సిటీ : ఒక పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ విద్యార్థి నేతలపై దాడులకు తన మనుషులను ఉసిగొల్పి దాడి చెయ్యడం పిరికిపంద చర్య అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్గౌడ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థి నేతలపై దాడులకు పాల్పడడం సరికాదని హితవు పలికారు.
అదే పంథా తామూ కొనసాగిస్తే రేవంత్రెడ్డి గడప కూడా దాడలేడని హెచ్చరించారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను రెచ్చగొడితే అధికారంలోకి వస్తానని కలలు కంటున్న రేవంత్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామన్నారు.