మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డినగర్కు చెందిన ఈశ్వరమ్మకు రూ. 5 లక్షలు, గచ్చిబౌలి డివిజన్ కృష్ణకాలనీకి చెందిన అనంతరెడ్డికి రూ. 2లక్షలు, చందానగర్ డివిజన్ పరిధిలోని అనంత రెడ్డికి రూ. 22 వేలు సీఎం సహాయ నిధి పథకం కింద దరఖాస్తు చేసుకోగా …ఆర్థిక సాయం మంజూరు పత్రాలను విప్ ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్ రాగం నాగేందర్యాదవ్తో కలిసి ఆదివారం సాయంత్రం తన నివాసంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు భరోసాగా నిలుస్తున్నదన్నారు. ఆర్థికంగా వెనకబడి అనారోగ్యాల బారిన పడుతున్న వారికి సీఎం సహాయ నిధి వైద్య చికిత్సలు చేయించుకునేందుకు ఆరోగ్యాలను మెరుగు పరుచుకునేందుకు దోహదపడుతుందన్నారు.