మియాపూర్ : సీఎం సహాయ నిధి పేదలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండకు చెందిన అనూషకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 60 వేల చెక్కును విప్ గాంధీ గురువారం తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు ఆరోగ్య భరోసాను ఇచ్చిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తూ కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్నదన్నారు. ఆపదలో ఉన్న పేదలకు ఆపన్న హస్తంలా సీఎం సహాయ నిధి భరోసాను కల్పిస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొండల్రెడ్డి, కాశీనాథ్యాదవ్ పాల్గొన్నారు.