అత్తాపూర్ : పేద ప్రజలకు అన్ని విదాలుగా వైద్యసాయం అందిచేందుకు సిఎంఆర్ఎఫ్ నిదులు ఎంతగానో ఉపయోగ పడతాయని రాజేంద్రనగర్ నియోకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ హైదర్గుడాకు చెందిన యస్ లక్ష్మమ్మ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. దీంతో కుటంభసభ్యులు ఆసుపత్రికి సంబందించిన బిలుల్లను ఎమ్మెల్యే కార్యలయంలో అందజేసి, సిఎంఆర్ఎప్ నిదుల కోసం ఆర్జీ పెట్టున్నారు.
ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ ఆదేశాలతో సంబంధిత అధికారులు పూర్తి వివరాలు సేకరించి రెండు లక్షల ఇరవై ఐదు వేలా రూపాయలను మంజారు చేశారు. దీంతో లక్ష్మమ్మ భర్త వెంకటేష్కు ఎమ్మెల్యే చెక్ను అందజేశారు. ఈ సందర్బం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిఎంఆర్ఎఫ్ నిదులు పేదలకు వరం అని, సిఎంఆర్ఎఫ్ నిదుల కారణంగా ఎంతో మంది వైద్యసాయం పొందారని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు మిద్దెల సురేందర్రెడ్డి, అమరేందర్, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, గ్రేటర్ కోఆర్డినేటర్ శ్రీదర్రెడ్డి , శ్రీనివాస యాదవ్, మహేస్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.