మియాపూర్ : సీఎం రిలీఫ్ఫండ్ ఆపదలోఉన్న పేదలకు ఆసరా నిస్తుందని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్వీన్కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకు చెందిన మాధవివర్మకు సీఎం రీలీఫ్ఫండ్కింద మంజూరైన 60వేల చెక్కును కార్పొరేటర్ దొడ్లవెంకటేష్గౌడ్తో కలిసి అందజేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రిలీఫ్ఫండ్ను అన్నివర్గాల ప్రజలకు అందజేసి అండగా నిలుస్తున్నారన్నారు. అర్హులైన ప్రతిఒక్కరు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆదర్శ్రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజుయాదవ్, కొండల్రెడ్డి, చాంద్పాషా, పొడుగు రాంబాబు తదితరులు పాల్గోన్నారు.