గోల్నాక : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరానిస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అనారోగ్యానికి గురై దవాఖానాలో చికిత్స పొందుతున్న కాచిగూడ డివిజన్ చెప్పల్బజార్కు చెందిన డి.నాగేందర్ సీఎం రిలిఫ్ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నాడు.
కాగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.60వేల విలువగల చెక్కును బుధవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.