బేగంపేట్ : మోండామార్కెట్, జెమ్స్స్ట్రీట్ సబ్స్టేషన్ పరిధిలలోని విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్లు కారణంగా (30)వ తేదీ సోమవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. మోండామార్కెట్ సబ్స్టేషన్ ధర్మకాంట ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఏజే కాలనీ, గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, రామాస్వామి కాంపౌండ్, ఉప్పలమ్మ దేవాలయం, రామాలయం ఏరియాలలో పై విధంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు.
గాంధీనగర్ పీఎస్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంట వరకు బోటనీ స్కూల్, టీఎస్ టూరిజం, లారీ అడ్డా, రాణిగంజ్ రాగిచెట్టు ఏరియా ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ నిలిపివేస్తారు.జెమ్స్స్ట్రీట్ సబ్స్టేషన్ సీసీనగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఏజే కాలనీ, గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, రామాస్వామి కాంపౌండ్, ఉప్పలమ్మ దేవాలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.