వ్యవసాయ యూనివర్సిటీ : రంగారెడ్డిజిల్లా రాజేంద్రనగర్ నార్మ్లో పనిచేస్తున్న గుత్తికొండ అనీజకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ప్రజాసంబంధాల విషయంలో ఆమె చేస్తున్న కృషికిగాను పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిఆర్సీఐ) అమేయ ఉమెన్ ఆఫ్ది ఇయర్ (2021)అవార్డు లభించింది. ఈ మేరకు గోవాలో శనివారం సాయంత్రం జరిగిన పీఆర్సీఐ15వ గ్లోబల్ ముగింపు కార్యక్రమంలో గోవా సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి గోవింద్ గవాడే చేతుల మీదుగా అనిజా అవార్డు అందుకున్నారు.
ప్రజాసంబంధాలను మెరుగు పర్చడం , పలువురిని చైతన్య పర్చడం , కార్పోరేషన్ , కమ్యూనికేషన్ మీడియా రిలేషన్స్, నార్మ్కు వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పించడం, శిక్షణ, వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న నూతన పరిజ్ఞా నంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలలో అనీజా ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారు. వ్యవసాయ విద్యపట్ల అనేకమంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వం , ప్రయివేటు సంస్థలు ఏర్పాటు చేసిన అనేక సెమినార్లలో పాల్గొని పలువురికి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించినందుకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు.