కాచిగూడ : ఆవులను తీసుకెళ్లడానికి పట్టాలు దాటుతుండగా ప్రమాదావశాత్తు డెమో రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్.సత్యనారాయణ రాజు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్, పాలమాకుల్ మండలం, తిల్లోనిగూడ గ్రామానికి చెందిన తిప్పకుంట రాములు (73)సోమవారం తిమ్మాపూర్-ఉందానగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఆవులను తీసుకెళ్లడానికి పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన డెమో రైలు ఢీకొనడంతో ఆ వృద్దుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనపర్చుకుని ఉస్మానియా దవాఖానకు తరలించారు.కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు పేర్కొన్నారు.