మారేడ్పల్లి : మోండా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆకుల హరికృష్ణ ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా హరికృఫ్ణ మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే జి. సాయన్నలను కలిసి పూలగుచ్చాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల హరికృష్ణ మాట్లాడుతూ..డివిజన్లో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బస్తీ, కాలనీల్లో పేద ప్రజలకు అందేవిధంగా పని చేస్తానని తెలిపారు. తన పై నమ్మకంతో రెండవ సారి డివిజన్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే జి. సాయన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.