ఎంపీపీ డుబ్బుల నానయ్య
మండలకేంద్రంతో పాటు రవీంంద్రనగర్-1లో కేంద్రాలు ప్రారంభం
చింతలమానేపల్లి, మే 17: కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఉంటుందని ఎంపీపీ డుబ్బుల నానయ్య అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు రవీంద్రనగర్-1లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకానికి రూ. 1888, సాధారణ రకానికి రూ. 1868 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూ చించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోజిత్ మండల్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు భీంకరి నారాయణ, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు టోంబ్రె మారుతి, డైరెక్టర్లు హరిదాస్ మండల్, రామయ్య, మహేశ్, నాగపురి మహేశ్, పీఏసీఎస్ సీసీవో రాజేశ్, సెంటర్ ఇన్చార్జి అమిర్ హుస్సేన్, ఏఈవో స్వే త, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, రైతులు మాధవ్ స ర్దార్, సంజయ్బాల, తదితరులు పాల్గొన్నారు.