యాదాద్రీశుడి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సీజేఐ దంపతులకు ఘన స్వాగతం పలికిన
మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి
యాదాద్రి, జూన్15: సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గంలో యాదాద్రి కొండపై నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలాలయ ద్వారం వద్ద సీజేఐ దంపతులకు ఆలయ ప్రధానార్చకులు, అధికారులు భాజాభజంత్రీలు, వేద మంత్రాలతో పూర్ణకుంభంతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివారి గర్భాలాయానికి వెళ్లిన సీజేఐ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
పునర్నిర్మాణ పనులను తిలకించిన జస్టిస్ రమణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను జస్టిస్ ఎన్వీ రమణ తిలకించారు. యాదాద్రీశుడికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన నూతనంగా నిర్మిస్తున్న ప్రధానాలయం, మాఢవీధులు, ప్రధానాలయంలోని లోపలి భాగంలోని మండపాలు, సప్త రాజగోపురం, స్వామివారి నూతన గర్భాల యం, యాలీ పిల్లర్లను పరిశీలించారు. సుమారు 20 నిమిషాలపాటు ప్రధానాలయం చు ట్టూ కలియతిరిగి ఆలయ వైభవాన్ని వీక్షించారు.
టెంపుల్ సిటీ, గండిచెరువు విజిట్
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండకింద నిర్మిస్తున్న టెంపుల్సిటీ, గండిచెరువు, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వీవీఐపీలకు నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్లను జస్టిస్ ఎన్వీ రమణ వీక్షించారు. గుట్ట చుట్టూ నిర్మిస్తున్న ఆరులైన్ల రోడ్లను పరిశీలించి, నేరుగా ప్రెసిడెన్షియల్ సూట్లను పరిశీలించారు. గండిచెరువు పక్కనే నిర్మిస్తున్న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, అన్నదానం భవనాన్ని వీక్షించి నిర్మా ణ పనుల తీరును పరిశీలించారు. అదేవిధంగా స్వామివారి కొండకు పక్కనే 800 ఎకరాలలో వివిధ పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో నిర్మించిన టెంపుల్ సిటీపైకి జస్టిస్ ఎన్వీ రమణ వెళ్లారు.
సీజేఐకి ఘన స్వాగతం..
యాదాద్రి కొండపై ఉన్న వీవీఐపీ అతిథిగృహం వద్దకు రాగా నే జస్టిస్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి పుష్పగుచ్ఛం, తులసి మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.
ప్రభుత్వాన్ని అభినందిస్తూ..
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం మహాద్భుతంగా చేపట్టిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రిలోని సందర్శకుల పుస్తకం లో రాశారని ఆలయ ఈవో గీత తెలిపారు. మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న విధానాలను అభినందిస్తూ చరిత్రలో గుర్తుండిపోయేలా పుస్తకంలో రాశారన్నారు.
సీజేఐ యాదాద్రి పర్యటన సాగిందిలా..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఉదయం 8.41 గంటలకు యాదాద్రికి చేరుకున్న సీజేఐ జస్టిస్ రమణ దంపతులు ఉదయం11.56గంటలకు తిరిగి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు.
n 8.41 గంటలకు యాదాద్రికి చేరిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
n 8.44 గంటలకు యాదాద్రి కొండపై మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి,జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి ఘన స్వాగతం పలికారు
n 9.09 గంటలకు బాలాలయంవద్ద పూర్ణకుంభంతో
స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ అధికారులు
n 9.10గంటలకు స్వామిని దర్శించుకున్న సీజేఐ దంపతులు
n ఉదయం 9.23 గంటలకు దర్శనం పూర్తి
n 9.25 నుంచి 9.36 వరకు ఆశీర్వచనం
n 9.37 గంటలకు సీజేఐకి స్వామివారి చిత్రపటాన్ని
అందజేసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
n 9.43 నుంచి 10.20 గంటల వరకు ఆలయ పరిశీలన
n 10.22 నుంచి 11.05 గంటల వరకు అల్పాహారం
n 11. 14 గంటలకు రింగురోడ్డు పనుల వీక్షణ
n 11.17 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్ల పరిశీలన
n 11.40- 11.50 గంటల వరకు టెంపుల్ సిటీ పరిశీలన
n 11.56 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం.