చార్మినార్ : మానులా మొదలై నేడు మహావృక్షంగా ఎదిగిన సిటి కాలేజీ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపి వారిని ప్రపంచ వ్యాప్తంగా చేరవేసిందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు. మంగళవారం సిటి కాలేజీ నిర్వహించిన శత వసంతాల వేడుకల్లో నవీన్ మిట్టల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సిటి కాలేజీ తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందన్నారు.
ఉద్యమంతోపాటు విద్యాభోధనలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తూ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఉద్యమాల సమయంలో కీలక భూమిక పోషించిన సిటి కాలేజీ విద్యార్థులకు విద్యాభోధన అందించడంలోనూ తన పాత్రను మరింత ద్విగుణీకృతం చేసుకుంటూ బంగారు బాటను పరించిదన్నారు. నేటి అధునికతను చాటుకుంటూ కాలేజీలో వివిధ రంగా ల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి 50 కోర్సులతో అగ్రగామిగా కొనసాగుతుందన్నారు.
నేడు అత్యున్న స్థానాల్లో సేవలు అందిస్తున్న అనేక మంది సిటి కాలేజీ పూర్వవిద్యార్థులేనని అచార్య ఘంటా చక్రపాణి తెలిపారు. సిటి కాలేజీ నగరానికి ఓ శాంతినికేతన్లాంటిదని అభివర్ణించారు. ఏడవ నిజాలం ఎంతో దార్శనికుడని, ఆయన ముందు చూపుతోనే సిటి కాలేజీ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోని సంస్థానాదీశులెవరూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు ఉన్న దూరదృష్టితో భవిష్యత్తును గుర్తించలేక పోయారని తెలిపారు.
రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా సిటి కాలేజీతో అనుబంధమున్న అనేకమంది ప్రముఖులు ఉన్నారని తెలిపారు. వందేళ్ల కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులు సిటి కాలేజీకి చెందినవారిని తెలుసుకుంటే మనస్సు ఉప్పొంగు తుందని నిజాం వారసుడు నవాబ్ నవాజ్ అలీఖాన్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. తమ పూర్వీకులు నెలకొల్పిన విద్యావనం నుండి భవిష్యత్తులో మరింత మంది ప్రపంచానికి మార్గదర్శకులు రావాలని అకాంక్షించారు.
సిటి కాలేజీ అభ్యున్నతికి పాడుపడేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. శత వసంతాల వేడుకల సందర్భం గా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శతాబ్థి ఉత్సవాల సందర్భంగా వేడుకల డిజిటల్ లోగోను కమిషనర్ నవీన్మిట్టల్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సిటి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ భాలభాస్కర్తోపాటు తెలుగు సహాయ ఆచార్యులు కోయి కోటేశ్వర్రావు, శ్రీకాంత్రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ అనురాధరెడ్డి, అధ్యాపకులు పావనితోపాటు అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.