మొక్కట్రావ్పేటలో 334 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ పరిహారం
ఫలించిన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషి
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
వెల్గటూర్, జూన్ 7 :12 ఏళ్ల సమస్యకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిష్కారం చూపారు. మొక్కట్రావ్పేట గ్రామంలోని బీసీలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి ఆశలు వదులుకున్నారు. కానీ అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ సమస్య పరిష్కారానికి ఏళ్ల నుంచి కృషి చేశారు. ఈ వ్యవహారాన్ని తన భుజాలపై వేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు సమస్యను పలుమార్లు వివరించారు. చివరకు ఒప్పించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల పరిహారాన్ని అందించే విధంగా ప్రత్యేక జీవోను విడుదల చేయించారు. దీంతో గ్రామంలోని 334 బీసీ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. –
2004లో ప్రారంభమైన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 గ్రామా లు ముంపునకు గురయ్యాయి. ఇందులో వెల్గటూ ర్ మండలంలోని చెగ్యాం, తాళ్లకొత్తపేట, ఉండేడ, రాంనూర్, మొక్కట్రావ్పేట, కోటిలింగాల గ్రామా లున్నాయి. అందులో చెగ్యాం, ఉండేడ, మొక్కట్రావుపేటలో గ్రామాలు పూర్తి స్థాయిలో ముంపునకు గురి కావడం లేదని కొంత భాగానికే ఆర్అం డ్ఆర్ ప్యాకేజీని ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలను పూర్తి స్థాయిలో ముంపు కింద తీసుకొని అందరికీ ఒకే దగ్గర పునరావాసం క ల్పించాలని అప్పటి ఈ ప్రాంత ఎమ్మెల్యే కొప్పు ల ఈశ్వర్ను కలిసి విన్నవించారు. దీంతో కొప్పు ల అప్పటి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగితే అప్పటి ప్రభుత్వం 2009 ఫిబ్రవరిలో జీవో నంబర్ 20 ద్వారా చెగ్యాం, ఉండేడ, మొక్కట్రావుపేట గ్రామాలను పూర్తి ముంపు గ్రామాలుగా తీసుకున్నారు. కానీ మొక్కట్రావుపేట బీసీ కాలనీ ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణానికి స్థలం దొరక్కపోవడంతో 334 కుటుంబాలు అక్కడే ఉన్నాయి.
గత ప్రభుత్వాల వైఫల్యం
మొక్కట్రావుపేట గ్రామంలో 441 ఇండ్లు న్నాయి. అందులో ప్రాజెక్ట్ కింద ఎస్సీ కాలనీలోని 97 ఇండ్లు ముంపునకు గురతున్నాయని వారికి గ్రామం ప్రారంభంలో ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసి పునరావాసం కల్పించారు. 2009 లో వచ్చిన 20 జీవో నంబర్ ప్రకారం మొత్తం గ్రామాన్ని ముంపుగా తీసుకున్నారు. కానీ తర్వాత తీసుకున్న 334 కుటుంబాలకు సరిపడా స్థలం ఎక్కడా దొరకకపోవడంతో ఆ సమస్య మరుగున పడిపోయింది. గ్రామం ముంపునకు గురైందనే కారణంతో గత ప్రభుత్వాలు ఈ కాలనీకి కనీస అవసరాలకు కూడా నిధులు కేటాయించలేదు.
మంత్రి కొప్పుల ప్రత్యేక చొరవ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొక్కట్రావుపేట బీసీ కాలనీపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామాభివృద్ధికి రూ.2.48 కోట్లతో గ్రామంలో సీ సీ రోడ్లు, రూ.50 లక్షలతో స్కూల్ భవనం, రూ. 22.50 లక్షలతో జీపీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించారు. అలాగే 334 బీసీ కుటుంబాల వ్యవహారాన్ని తన భుజాలపై వేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు పలుమార్లు వివరించారు. చివరకు ఒప్పించి ఒక్కో కుటుంబానికి రూ.3లక్ష ల పరిహారాన్ని అందించే విధంగా ప్రత్యేక జీవోను విడుదల చేయించారు.