జమ్మికుంట, జూన్ 7 : కాంగ్రెస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం జమ్మికుంట పట్టణ మున్సిపల్ 14వ వార్డు కౌ న్సిలర్ బోగం సుగుణ, నాయకుడు వెంకటేశ్ హన్మకొండలోని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ నివాసంలో ఆయనను కలిసి టీఆర్ఎస్లో చేరారు. వినోద్కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. మరోవైపు ఇల్లందకుంట మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయ, ఆమె భర్త కుమార్, పలువురు వార్డు మెంబ ర్లు, యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిట్స్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని, ఇందులో భాగంగానే టీఆర్ఎస్లో చేరామని తెలిపారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, నాయకులు సంపెల్లి భీంరావు, పర్లపెల్లి రమేశ్, సింగాపూర్ కిట్స్లో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ, సీనియర్ నాయకులు సచిన్రెడ్డి, సంజీవరెడ్డి, సంపత్, సురేందర్, ఐలయ్య, సమ్మిరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.